2011-03-11

ఇదేనా బాధని చూపించే మార్గము???

నిన్న మిలియన్ మార్చ్ లో విగ్రహాలు పడగొట్టటం నాకు ఎందుకో బాధ గా అనిపించింది. అవి ప్రాణం లేని విగ్రహాలు వాటిని పడేస్తే పోయేది ఏముంది అని అడగచ్చు నిజమే  వాటికీ ప్రాణం లేదు. కాని వాళ్ళకి ఈ ప్రాంతీయ గొడవలకి కూడా  ఎటువంటి సంబంధం లేదు. అసలు వాళ్ళు జీవించిన సమయం లో ఈ రెండు ప్రాంతాలు లేవు అని నేను అనుకుంటున్నాను. అలాంటప్పుడు పాపం వాళ్ళ విగ్రహాలు ఏమి చేసాయి?

అంతగా మీ ఆగ్రహం  చూపించాలి అంటే పక్కనే సచివాలయం వుంది దానిముందు నిశబ్ద ధర్నా చేయాల్సింది. అందరు సచివాలయం ముందు నిల్చుంటారు కాని ఎవ్వరు మాట్లాడరు. ఇంతమంది జనాలని చూసి పోలీసులు తరమాలని చూసినా మీరు మాట్లాడక పోతే వాళ్ళు ఏమి చేయలేరు తోకముడుచుకొని మీరు ఎప్పుడు వెళ్తారో అని ఎదురుచూడటం తప్ప. వాళ్ళకి మిమ్మల్ని తరమటానికి ఒక కారణం కావాలి. మీరు ఆ కారణం ఇవ్వనంతవరకు వాళ్ళు ఏమి చేయలేరు. కాదని అంటారా???

ఈ రాజకీయనాయకులకి బుద్ధి ఎప్పుడు వస్తుందో?? ఈ గొడవలకి అంతం ఎప్పుడు చేస్తారో? ఇలాగే జాప్యం చేస్తుంటే రెండు ప్రాంతాల మధ్యన ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అని భయం వేస్తోంది..

నాలాంటి జీవులకి ఏమి జరిగిన ఒకటే...మా ఆఫీసు ఉండక మానదు నేను వెళ్ళాక మానను కాని ఎంతో మంది విద్యార్ధుల హృదయాలలో, చిన్నపిల్లల మనసులలో ద్వేషపు జ్వాలలు నింపుతున్నారు అవి ఇప్పుడు రాజకీయనాయకుల స్వార్ద ప్రయోజనాలు సమకూర్చిన...తర్వాత అక్కడి సమాజానికి చాల చేటు చేస్తాయి...అది సమైక్యంద్ర ఐన సరే తెలంగాణా ఐన సరే...మీకు వున్నది ఒక్క అభిప్రాయ భేదం మాత్రమే...శత్రుత్వం లేదు...

మిమ్మల్ని రెచ్చగొట్టిన నాయకులూ రేపు అన్ని సద్దుమనిగాక తిరిగి కలిసిపోతారు..కాని మీరు అలా కాలేరు...అందుకే అందరికి నా విజ్ఞప్తి ఏంటంటే " మీ భావం/ప్రాంతం కోసం మీరు పోరాడండి తప్పు లేదు...కాని పక్క ప్రాంతం వాడి మీద ద్వేషం పెంచుకోవద్దు...వాడు మీకు అన్యాయం చేయలేదు రాజకీయ జూదంలో మీలాగే వాడు ఒక పావు అంతే..వాడు వాడి పొట్ట పట్టుకొని మీ లాగే పని వెతుకుంటూ వచ్చాడు...మీ అభివృద్ధి జరగలేదు అంటే అది రాజకీయాల తప్పు..కాని వేరే ప్రాంతంలో వున్నా సామాన్య ప్రజనీకానిది కాదు.


గమనిక: ఇది నా మనసులో ఉన్న భావము.ఏ ప్రాంతాన్ని కించపరచటం నా ఉద్దేశం కాదు. ఒక వేళ మీకు ఏమైనా అలాంటిది అనిపిస్తే నాకు తెలియచేయండి...సరి చేసుకుంటాను.
  

2 comments:

  1. I heard that the seed of hatred was sown in the children also. in one school in hyderabad they were encouraged to say " Jai telangana" instead "present' while giving their attedance. The age of the students is just 6 years. What they will achieve by this hatred GOD ONLY KNOWS.

    ReplyDelete